ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 28, 2021, 2:25 PM IST

ETV Bharat / state

అశోక్‌ గజపతిరాజు సహా 12 మందిపై కేసు కొట్టివేయాలని.. హై కోర్టులో క్వాష్‌ పిటిషన్‌

విజయనగరం పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ.. కేంద్ర మాజీ మంత్రి అశోకగజపతి రాజు, మరో 12 మంది హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. జీతాలు ఇవ్వాలని అడిగినందుకు అన్యాయంగా వారిపై కేసు నమోదు చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది.

mansas trust
mansas trust

విజయనగరం పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ.. మాజీ కేంద్రమంత్రి అశోకగజపతి రాజు, మరో 12 మంది హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై న్యాయస్థానం విచారణ జరిపింది. జీతాలు ఇవ్వాలని అడిగినందుకు అన్యాయంగా కేసు నమోదు చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

ఈ విషయమై... పూర్తి వివరాలు కావాలని ధర్మాసనం ప్రభుత్వ న్యాయవాదిని కోరింది. వివరాలు తెలిపేందుకు కొంత సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టును కోరారు. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది.

ABOUT THE AUTHOR

...view details