విజయనగరం జిల్లా పార్వతీపురంలో వడగండ్ల వర్షం కురిసింది. ఉదయం నుంచి కాస్త మబ్బులతో ఉన్న వాతావరణం మరింత చల్లబడి 40 నిమిషాల పాటు వర్షం కురిసింది. దీనికి తోడు వడగళ్ళు పడడంతో వాతావరణం చల్లబడింది. రెండు వారాలుగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుండడంతో ఎండవేడికి జనం అల్లాడిపోతున్నారు. ఇటువంటి తరుణంలో వరుణ దేవుడు కరుణించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ముందు గాలితో ప్రారంభమైన చినుకులు జోరందుకున్నాయి. వర్షం కురవడంతో ఎండ వేడి నుంచి ప్రజలు కాస్త ఉపశమనం పొందారు.
వడగండ్ల వాన.. ఎండ వేడిమి నుంచి ఉపశమనం
గత కొన్ని నెలలుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇవాళ విజయనగరం జిల్లాలో వాతవరణం చల్లబడి.. వడగండ్ల వర్షం కురిసింది. ప్రజలు ఎండ వేడిమి నుంచి కాస్త ఉపశమనం పొందారు.
పార్వతీపురంలో వడగండ్ల వాన
TAGGED:
ap_vzm-vadagalla_vana