విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని అన్నవరం నేరెళ్ల వలస కాలనీలో తెదేపా నాయకులు స్థానిక ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. భీమిలి అర్బన్ తెదేపా అధ్యక్షుడు గంట నూకరాజు ఆధ్వర్యంలో నేరెళ్ల వలసలో కూరగాయలు పంపిణీ చేశారు. తెదేపా నాయకులు మైలపల్లి లక్ష్మణ్రావు ఆధ్వర్యంలో సుమారు 1000 కుటుంబాలకు 2 లక్షల విలువైన కూరగాయలు గుడ్లు పంపిణీ చేశారు. ప్రజలందరూ సామాజిక దూరం పాటిస్తూ నిత్యావసరాలు అందుకున్నారు.
పేదలకు కూరగాయలు పంపిణీ చేసిన తెదేపా నేతలు
లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు విశాఖ జిల్లా భీమిలిలో తెదేపా నాయకులు నిత్యవసరాలు పంపిణీ చేశారు. కరోనా ఎదుర్కునేందుకు అందరూ సహకరించాలని నాయకులు కోరారు.
పేదలకు కూరగాయలు పంపిణీ చేసిన తెదేపా నాయకులు