ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పాత్రికేయుల మానసికోల్లాసం కోసమే పోటీలు' - విశాఖలో జర్నలిస్టుల షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు

జర్నలిస్టుల రాష్ట్ర స్థాయి షటిల్, బ్యాడ్మింటన్ పోటీలు విశాఖలో నిర్వహించనున్నట్టు వైజాగ్ ప్రొఫైల్ ఛైర్మన్ వెల్లడించారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు వసతులు ఏర్పాట్లు పూర్తైనట్లు తెలిపారు.

journalist badminton tournament
విశాఖలో జర్నలిస్టుల బ్యాడ్మింటన్

By

Published : Jan 18, 2020, 7:35 PM IST

విశాఖలో జర్నలిస్టుల బ్యాడ్మింటన్- వివరాలు వెల్లడిస్తున్న వైజాగ్‌ ప్రొఫైల్‌ ఛైర్మన్‌
జర్నలిస్టులకు రాష్ట్ర స్థాయి షటిల్, బ్యాడ్మింటన్ పోటీలు విశాఖపట్నంలో నిర్వహించనున్నట్లు వైజాగ్ ప్రొఫైల్ ఛైర్మన్ కృష్ణారావు తెలిపారు. నిత్యం పని ఒత్తిడిలో ఉండే జర్నలిస్టులకు మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం పెంపొందించాలనే ఉద్దేశంతోనే ఈ క్రీడాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్, వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో గాజువాక గ్రీన్ సిటీ లక్ష్య బ్యాడ్మింటన్‌ ఇండోర్ స్టేడియం వేదిక పోటీలు జరగనున్నాయి. వైజాగ్ ప్రొఫైల్ సంస్థ ఈ పోటీలకు స్పాన్సర్​గా వ్యవహరిస్తుందని వివరించారు. ఈ నెల 23 నుంచి ప్రారంభంకానున్న పోటీల్లో 13 జిల్లాల జర్నలిస్టులు పాల్గొనాలని సూచించారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు వసతులు ఏర్పాట్లు పూర్తైనట్లు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details