ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 14, 2020, 8:20 AM IST

ETV Bharat / state

దేవరాపల్లి వద్ద గుంతలో కూరుకుపోయిన లారీ..

విశాఖ జిల్లా దేవరాపల్లి వద్ద శారదనదిపై ఉన్న కాలిబాటలో జీసీసీ డిపోకు చెందిన లారీ గుంతలో కూరుకుపోయింది. లారీ పక్కకు ఒరిగిపోయి కొన్ని సరుకులు నదిలో పడిపోయాయి.

Lorry stuck in   Pit at devarapalli
గుంతలో కూరుకుపోయిన లారీ


విశాఖ జిల్లా దేవరాపల్లి వద్ద శారద నదిపై శిథిలావస్థలో ఉన్న కాలిబాటపై గుంతలో రేషన్ సరకులతో లారీ కూరుకుపోయింది. అనంతగిరి మండలంలోని లారీ పక్కకు ఒరిగిపోయి కొన్ని సరుకులు నదిలో పడిపోయాయి. ప్రమాదం నుంచి బయటపడిన స్థానికులు సరుకులు పట్టుకున్నారు. కాలిబాటపై లారీ కూరుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని గంటల తర్వాత ప్రోక్లెయిన్ సాయంతో లారీని బయటకు లాగారు. పెను ప్రమాదం నుంచి బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాలిబాట మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details