ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు - ఏపీ ఆదర్శ పాఠశాలలు

ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈనెల 25వ తేదీ వరకు పెంచారు. విద్యార్థులు ఆన్​లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Extension of application deadline for sixth class admissions in ideal schools in ap
ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు

By

Published : Aug 6, 2020, 7:22 PM IST

ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువును మరోసారి పెంచారు. ఈనెల 25వ తేదీ వరకు పెంచుతున్నట్లు విశాఖ జిల్లా చీడికాడ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ హీరాలాల్ తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 164 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. విశాఖ జిల్లాలోని చీడికాడ, నర్సీపట్నం, రావికమతం, కసింకోట, మునగపాక మండలాల్లో 5 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రవేశాలు లాటరీ ద్వారా రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఉంటాయని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details