ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

108 కేసుల బీరు, 16 కేసుల మద్యం స్వాధీనం - seized

ఎన్నికల వేళ పోలీసులు చేస్తున్న దాడుల్లో డబ్బు, మద్యం భారీగా పట్టుబడుతోంది. తాజాగా విశాఖ జిల్లా జైనాయుడుపాలెంలో లక్షా 75 వేల రూపాయల విలువ చేసే మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న మద్యం కేసులతో ఎక్సైజ్ శాఖ పోలీసులు

By

Published : Mar 25, 2019, 9:07 PM IST

భారీగా మద్యం పట్టివేత
విశాఖ జిల్లా రోలుగుంట మండలం జైనాయుడుపాలెంలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని అనకాపల్లి టాస్క్​ఫోర్స్, ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. గ్రామంలో లైసెన్స్ కలిగి ఉన్న మద్యం దుకాణానికి చెందిన మద్యాన్ని అనుమతి లేని ప్రదేశంలో నిల్వ ఉంచినట్లుసమాచారం అందగా ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 108 బీరు కేసులు, 16 మద్యం కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడిన మద్యం సుమారు లక్షా 75 వేల రూపాయల విలువ ఉంటుందని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details