ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుడ్డిగుమ్మి జలపాతంలో 3 మృతదేహాలు లభ్యం - గుడ్డిగుమ్మి జలపాతంలో పడి ఇద్దరు యువకులు మృతి న్యూస్

విశాఖ జిల్లా గుడ్డిగుమ్మి జలపాతంలో గల్లంతైన ముగ్గురి మృతదేహాలు బయటపడ్డాయి. ఉదయం ఇద్దరి మృతదేహాలను వెలికితీయగా.. కాసేపటికి మిగిలిన వ్యక్తి మృతదేహం లభ్యమైంది.

గుడ్డిగుమ్మి జలపాతంలో 2 మృతదేహాలు లభ్యం
గుడ్డిగుమ్మి జలపాతంలో 2 మృతదేహాలు లభ్యం

By

Published : May 31, 2021, 9:21 AM IST

Updated : May 31, 2021, 12:05 PM IST

విశాఖ జిల్లీ తీగలవలస గ్రామ సమీపంలోని గుడ్డిగుమ్మి జలపాతంలో గల్లంతైన ముగ్గురి మృతదేహాలు వెలికి తీశారు. హుకుంపేట మండలం తీగలవలసకొండల్లో ఉన్న గుడ్డి గుమ్మి జలపాతంలో ఆదివారం మధ్యాహ్నం పదిమంది యువకులు ఫోటోలు తీసుకుంటుండగా కాలుజారి ఒకరు పడిపోయారు.

రక్షించేందుకు ప్రయత్నించి మరో ఇద్దరు నీటిలో పడిపోయారు. పోలీసులు, విపత్తు నిర్వహణ సంస్థ సిబ్బంది నిన్న సహాయక చర్యలు చేసినప్పటికీ రాత్రి కావడంతో వెనుదిరిగారు. ఇవాళ ఉదయం.. ఇద్దరి మృతదేహాలు వెలికితీయగా.. కాసేపటికి మిగతా వ్యక్తి మృతదేహాన్ని సైతం గుర్తించారు.

Last Updated : May 31, 2021, 12:05 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details