మెళియాపుట్టి మండలం గోకర్ణపురం గ్రామం కాలువలో గల్లంతైన వ్యక్తి మృతి చెందాడు. ఈ నెల 13న అధిక వర్షాలతో గ్రామ సమీపంలో ఉన్న కాలువలో భారీగా వరద నీటి ప్రవాహం వచ్చింది. ఈ వరదలో గ్రామానికి చెందిన శ్రీనివాసరావు గల్లంతయ్యాడు. అప్పటి నుంచి పలాస అగ్నిమాపక సిబ్బంది, విజయనగరం ఎస్డీఆర్ఎస్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. కాగా శుక్రవారం అతని మృతదేహాం లభ్యమైంది.
గోకర్ణపురం గ్రామ కాలువలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
గోకర్ణపురం గ్రామం కాలువలో ఈ నెల 13న గల్లంతైన వ్యక్తి మృతదేహం శుక్రవారం లభ్యమైంది. మూడు రోజులగా గాలింపు చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది, విజయనగరం ఎస్డీఆర్ఎస్ సిబ్బంది ఎట్టకేలకు శ్రీనివాసరావు మృతదేహాన్ని కనుగొన్నారు.
గల్లంతైన మృతదేహం లభ్యం