మానసిక ఉల్లాసానికి, శరీర ఆరోగ్యానికి క్రీడలు ఎంతో దోహద పడతాయని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండల విద్యాశాఖ అధికారి కరమున అప్పారావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఐదు విభాగాల్లో ఎనిమిదో తరగతి విద్యార్థినీ, విద్యార్థులకు క్రీడా పోటీలు ప్రారంభించారు. స్థానిక సురంగి రాజా మైదానంలో ఈ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఇందులో ఖోఖో, కబడ్డీ, టెన్నికాయిట్, వాలీబాల్, యోగా పోటీల్లో వందల సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు.
ఇఛ్చాపురం సురంగి రాజా మైదానంలో ఉత్సాహంగా ఆటల పోటీలు
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం సురంగి రాజా మైదానంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థినీ విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను మండల విద్యాశాఖాధికారి కరమున అప్పారావు ప్రారంభించారు.
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో క్రీడా పోటీలు