ప్రకాశం జిల్లాలోని చాలా మంది రైతులు కనీసం రెండు.. అంతకు మించిన సంఖ్యలో పశువులను పోషిస్తున్నారు. వాటికి గతంలో 25 వేల మెట్రిక్ టన్నుల సైౖలేజ్(పాతర) గడ్డి, 4 వేల మెట్రిక్ టన్నుల దాణామృతం, 7 వేల మెట్రిక్ టన్నుల దాణాను ప్రభుత్వం సరఫరా చేసేది. అలాంటిది ఏడాదిగా పంపిణీని నిలిపివేసింది. దాంతో అక్టోబరు ముందు వరకు వర్షాల్లేక, పచ్చిగడ్డి దొరక్క పోషకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నవంబరులో వర్షాలు కురవడంతో పచ్చిగడ్డి సమస్య కొంత తీరినా దాణా, దాణామృతం, సైౖలేజ్ అందకపోతుండడంతో సుదూర ప్రాంతాల నుంచి వరిగడ్డిని సుమారు రూ.16 వేలకు, కిలో రూ.2కు లభించిన సైలేజ్ను రూ.6కు కొనుగోలు చేసి ట్రాక్టర్ల ద్వారా తెచ్చుకుంటున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఎలా ఉంటోందని ఆందోళన చెందుతున్నారు. గడ్డి కొరతతో బక్కచిక్కిన పాడి గేదెలు, ఎద్దులను అమ్మేసుకుంటుండగా వాటిని వ్యాపారులు లారీల్లో వధశాలలకు తరలిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, పశుసంవర్ధక శాఖ స్పందించి దాణా, దాణామృతం, సైలేజ్ సరఫరా చేయాలని వేడుకుంటున్నారు.
మార్చిలో ప్రతిపాదనలు సిద్ధం చేస్తాం: