ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ విద్యార్థులకు ఏమైంది.. 8 రోజులు ఎక్కడున్నారు? - ప్రకాశంలో ఈతకు వెళ్లి విద్యార్థులు మృతి న్యూస్

వసతి గృహ అధికారులేమో.. ఇంటికి వెళ్లారనుకున్నారు.. తల్లిదండ్రులేమో.. హాస్టల్​లోనే ఉన్నారుకున్నారు. వచ్చి చూసిన తండ్రికి మాత్రం విద్యార్థులు కనిపించలేదు. ఇంతకీ ఆ పిల్లల పరిస్థితి ఏమైంది? హాస్టల్​ నుంచి బయటకు వెళ్లిన విద్యార్థులు ఏమయ్యారు? ఎక్కడకు వెళ్లాలనుకున్నారు ? అసలేమైంది..?

hostel students died news in prakasham

By

Published : Oct 27, 2019, 12:14 PM IST

ఆ విద్యార్థులకు అదే చివరి సరదా అయింది!

ఆ ఇద్దరు విద్యార్థులు చనిపోయారన్న సంగతి వసతి గృహ అధికారులకు.. తల్లిదండ్రులకూ తెలియదు. ఓ విద్యార్థి తండ్రి వసతి గృహంలో చదువుకుంటున్న కొడుకును పలకరించాలని వచ్చాడు. కానీ... ఆ తండ్రికి వసతి గృహ అధికారులు చెప్పిన మాటలు విని ఏం జరిగిందో అర్థం కాలేదు. తన బిడ్డ హస్టల్​లోనే ఉన్నాడంటూ.. ఇంటికి రాలేదంటూ ఆందోళన చెందాడు. అనంతరం ప్రకాశం జిల్లా చీమకుర్తి పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేయడంతో గాలింపు చర్యలు చేపట్టారు. అప్పుడు భయంకరమైన చేదు నిజం బయటపడింది.

ప్రకాశం జిల్లా పొదిలి మండలం వేలూరు పంచాయతీ పరిధిలోని టి.సల్లూరు గ్రామానికి చెందిన ఇండ్లా సూర్యం (13), నల్లారెడ్డి పాలెం గ్రామానికి చెందిన చిన్నపు రెడ్డి బ్రహ్మారెడ్డి(12) చీమకుర్తిలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో ఉంటూ... ప్రభుత్వపాఠశాలలో ఆరో తరగతి చదువుకుంటున్నారు. ఈ నెల 19వ తేదీన సెలవు పత్రం ఇచ్చి ఇంటికి బయలుదేరారు. కానీ వారి ప్రయాణం గమ్యం చేరకుండానే ముగిసిపోయింది. ఇంటికి వెళ్తూ.. సరదాగా ఈత కొడదామని తరచూ స్నానం చేసే మూసీ వాగులోకి దిగారు. అదే వారికి ఆఖరి సరదా అయింది.

తండ్రి ఫిర్యాదు మేరకు పొదిలి, చీమకుర్తి, మర్రిపూడి పోలీసులు మూసీ వాగు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. మధ్యాహ్నం సమయానికి ఓ మృతదేహాన్ని కనుగొన్నారు. అది బ్రహ్మారెడ్డిదిగా గుర్తించారు. అక్కడనుంచి రెండు కిలోమీటర్ల దూరంలో వాగు మధ్యలో సూర్యం మృతదేహాన్ని గుర్తించారు. ఎనిమిది రోజుల తర్వాత వారిని కనుగొన్నారు. పక్కపక్కనే ఉన్న రెండు గ్రామాల్లోని విద్యార్థులు చనిపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి:మిస్టరీ వీడిన దంపతుల హత్య కేసు... ఐదుగురు అరెస్టు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details