ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన దుండగులు - కర్నూలు జిల్లా డోన్ మండలం ఓబులాపురం

తెదేపా హయాంలో నిర్మితమైన బీటీ రోడ్డుకు సంబంధించిన శిలాఫలకాన్ని... గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.  ఈ మేరకు వైకాపా నాయకులపై అనుమానంతో తెదేపా నాయకులు డోన్ పోలీసు స్టేషన్​లో పిర్యాదు చేశారు.

శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

By

Published : Jul 14, 2019, 11:39 PM IST

శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

కర్నూలు జిల్లా డోన్ మండలం ఓబులాపురం వద్ద... బీటీ రోడ్డుకు సంబంధించిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. జాతీయ రహదారి నుంచి ఓబులాపురం మీదుగా ఎద్దు పెంట వరకు తెదేపా ప్రభుత్వంలో బీటీ రోడ్డు వేశారు. ఈ రోడ్డుకి సంబంధించిన శిలాఫలకాన్ని జాతీయ రహదారి పక్కన నిర్మించారు. శనివారం రాత్రి కొందరు వ్యక్తులు ఈ శిలాఫలకాన్ని పగలగొట్టారు. వైకాపాకు చెందిన వ్యక్తులే ఈ పని చేసి ఉంటారని డోన్ గ్రామీణ పోలీసు స్టేషన్​లో తెదేపా నాయకులు ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details