ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 27, 2020, 11:52 AM IST

ETV Bharat / state

నంద్యాల ఈఎస్​సీ పాలిటెక్నిక్ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

కర్నూలు జిల్లా నంద్యాల ఈఎస్​సీ పాలిటెక్నిక్ కళాశాలలో 1986-90 సంవత్సరంలో ఈసీఈ డిప్లొమా బ్యాచ్​ పూర్వ విద్యార్థులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమకు చదువు చెప్పిన అధ్యాపకులను ఘనంగా సత్కరించారు. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు.

నంద్యాల ఈఎస్​సీ పాలిటెక్నిక్ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం
నంద్యాల ఈఎస్​సీ పాలిటెక్నిక్ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

నంద్యాల ఈఎస్​సీ పాలిటెక్నిక్ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

కర్నూలు జిల్లా నంద్యాల ఈఎస్​సీ పాలిటెక్నిక్ కళాశాలలో 1986-90 సంవత్సరం ఈసీఈ డిప్లొమా బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 30 ఏళ్ల క్రితం కలిసి చదువుకున్న వారంతా... గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలుసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులను సన్మానించారు. వచ్చే ఏడాది నుంచి బ్యాచ్​లో టాపర్​గా నిలిచిన విద్యార్థికి నగదును అందజేయాలని నిర్ణయించారు. ప్రిన్సిపాల్ సూచన మేరకు కళాశాల భవన మరమ్మతులకు తమ వంతు సహకరిస్తామన్నారు. అనంతరం ఇటీవల మృతిచెందిన తమ తోటి విద్యార్థి గురునాథ రెడ్డికి నివాళులర్పించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details