కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలంలో పాదయాత్రలో మంత్రి జయరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 17 నెలల్లోనే 90 శాతం సంక్షేమ పథకాలు అమలు చేసిన ముఖ్యమంత్రి జగనన్న అని మంత్రి పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో సచివాలయాలు ద్వారా ప్రజల వద్దకే పరిపాలన అందిస్తున్న ప్రభుత్వం వైకాపాదేనన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామని మంత్రి తెలిపారు.
'చెప్పిన ప్రతి మాట సీఎం జగన్ నెరవేరుస్తున్నారు'
ప్రజా సంకల్పయాత్రలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రతి మాటను నెరవేరుస్తున్నారని.. కార్మికశాఖ మంత్రి జయరాం అన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు అడుగులు వేయించారన్నారు.
minister jayaram on welfare scheemes