ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 27, 2020, 12:02 PM IST

ETV Bharat / state

నూజివీడులో దంపతుల అనుమానాస్పద మృతి

కృష్ణాజిల్లా నూజివీడులో దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతుల బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Suspicious death of couple in Noojividu
నూజివీడులో దంపతుల అనుమానాస్పద మృతి

కృష్ణాజిల్లా నూజివీడు పట్టణంలో దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. పాండురంగ ఇండస్ట్రీస్​లో అకౌంటెంట్​గా విధులు నిర్వహిస్తున్న చిలకమర్రి నరసింహారావు, అతని భార్య విజయలక్ష్మి అనుమానాస్పదంగా మృతి చెందారు. వీరు డాక్టర్​ గంగాధరరావు ఆసుపత్రి సమీపంలో నివాసం ఉంటున్నారు. మృతుల బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గణేష్ కుమార్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details