కృష్ణాజిల్లా నందిగామ మండలం జొన్నలగడ్డ సరిహద్దు చెక్పోస్ట్ వద్ద సుబాబుల్ కూలీలతో వస్తున్న ట్రాక్టర్కు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, దానికున్న ట్రక్కు లింక్ ఊడిపోవడంతో ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. ప్రమాద సమయంలో 11 మంది కూలీలు ఆ వాహనంలో ప్రయాణిస్తున్నారు. ఐదుగురుకి గాయలు కాగా.. వారిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరందరూ చందర్లపాడు మండలం కోనాయ పాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.
ట్రాక్టర్ ప్రమాదం.. ఐదుగురికి గాయాలు
కృష్ణాజిల్లా నందిగామ మండలం జొన్నలగడ్డ సరిహద్దు చెక్పోస్ట్ వద్ద ఓ ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. అందులో ప్రయాణిస్తున్న వారిలో ఐదుగురికి గాయాలయ్యాయి.
ట్రాక్టర్ ప్రమాదం