ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 22, 2021, 11:21 AM IST

ETV Bharat / state

ట్రాక్టర్​ ప్రమాదం.. ఐదుగురికి గాయాలు

కృష్ణాజిల్లా నందిగామ మండలం జొన్నలగడ్డ సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద ఓ ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. అందులో ప్రయాణిస్తున్న వారిలో ఐదుగురికి గాయాలయ్యాయి.

tractor over turned
ట్రాక్టర్​ ప్రమాదం

కృష్ణాజిల్లా నందిగామ మండలం జొన్నలగడ్డ సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద సుబాబుల్​ కూలీలతో వస్తున్న ట్రాక్టర్​కు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్​, దానికున్న ట్రక్‌కు లింక్‌ ఊడిపోవడంతో ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. ప్రమాద సమయంలో 11 మంది కూలీలు ఆ వాహనంలో ప్రయాణిస్తున్నారు. ఐదుగురుకి గాయలు కాగా.. వారిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరందరూ చందర్లపాడు మండలం కోనాయ పాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details