విజయవాడలో ఉన్న కేఎల్ విశ్వవిద్యాలయంలో 2020కు సంబంధించిన ఇంజనీరింగ్, పీజీ కోర్సుల్లో ప్రవేశ నోటీఫికేషన్ను ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా విడుదల చేశారు. అడ్మిషన్లకు సంబంధించిన బ్రోచర్, గోడప్రతులు కార్యనిర్వాహక కార్యాలయంలో ఆవిష్కరించారు. అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలు, అత్యున్నత స్థాయి విద్య అందించడంలో కేఎల్ విశ్వవిద్యాలయం ఎల్లప్పుడూ ప్రథమ స్థానంలో ఉందని ఉపముఖ్యమంత్రి అన్నారు. ఇంజనీరింగ్ విద్య పూర్తయ్యేలోగా ప్రతి విద్యార్థికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కేఎల్ యూనివర్శిటీ కృషి చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. గడచిన నాలుగు దశాబ్ధాలుగా ఎంతో మంది విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించి అగ్రస్థానంలో నిలబెట్టిందని తెలిపారు.
కేఎల్ విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల
కేఎల్ యూనివర్సిటీలో ఉన్న ఇంజినీరింగ్, పీజీ కోర్సుల సీట్ల భర్తీకి గల నోటిఫికేషన్ను ఉపముఖ్యమంత్రి అంజాద్ భాషా చేతుల మీదుగా విడుదల చేశారు.
కేఎల్ విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసిన ఉపముఖ్యమంత్రి