ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజధాని భూములపై అనిశా కేసు: తదుపరి చర్యలపై హైకోర్టు స్టే - రాజధాని భూములపై హైకోర్టులో విచారణ వార్తలు

రాజధాని భూములకు సంబంధించి అనిశా నమోదు చేసిన కేసులో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని కోరుతూ న్యాయవాది మమతారాణి వేసిన వ్యాజ్యంపై విచారణ జరిగింది. మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్​తో పాటు మరికొందరిపై అనిశా నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటికి హైకోర్టు స్టే ఇచ్చింది.

hc on ex
hc on ex

By

Published : Sep 30, 2020, 8:35 AM IST

రాజధాని భూములకు సంబంధించి అవినీతి నిరోధకశాఖ నమోదు చేసిన కేసులో ఈ నెల 15న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని కోరుతూ న్యాయవాది మమతారాణి వ్యాజ్యం దాఖలు చేశారు. తనను ప్రతివాదిగా చేర్చుకొని వాదనలు వినిపించేందుకు తావివ్వాలని కోరారు. మమతారాణి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్​పై విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. ఇంప్లీడ్ పిటిషన్​పై కౌంటర్ దాఖలు చేశామని మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాసరావు తరపు న్యాయవాది ప్రణతి కోర్టుకు తెలిపారు. మమతారాణి తరపు న్యాయవాది కౌంటర్​పై తిరుగు సమాధానంగా కౌంటర్ వేసేందుకు సమయం కావాలని కోరారు . అందుకు సీజే అంగీకరించారు. మాజీ ఏజీ తో పాటు మరికొందరిపై అనిశా నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటిపైనా స్టే ఇచ్చిన హైకోర్టు .. ఎఫ్ఐఆర్​లోని అంశాలు మీడియాలో రాకుండా నిలువరిస్తూ గతంలోనే ఆదేశాలు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details