ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 3, 2020, 3:36 PM IST

Updated : Apr 3, 2020, 3:52 PM IST

ETV Bharat / state

'సీఎం జగన్..​ కరోనాపై ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు'

కరోనా వైరస్​ ప్రపంచాన్నే వణికిస్తుంటే.. ముఖ్యమంత్రి జగన్​ సాధారణ జ్వరం అంటూ.. ప్రజలను తప్పుదారి పట్టించేలా మాట్లాడుతున్నారని తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. వైరస్​ నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ప్రతిపక్షనేత చంద్రబాబు.. కరోనా కట్టడిపై నిరంతరం ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు వివరించారు.

'సీఎం జగన్..​ కరోనాపై ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు'
'సీఎం జగన్..​ కరోనాపై ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు'

ప్రభుత్వం కరోనా వ్యాప్తి కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్న చినరాజప్ప

రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడం మరింత ఆందోళన కలిగిస్తోందని.. ఈ మహమ్మారి నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప డిమాండ్​ చేశారు. కరోనా కట్టడిపై ప్రతిపక్షనేత చంద్రబాబు బాధ్యతగా వ్యవహరిస్తూ.. నిరంతరం ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు చెప్పారు. వైరస్​ ప్రపంచాన్నే వణికిస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్​.. సాధారణ జ్వరం అంటూ ప్రజలను తప్పుదారి పట్టించేలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజధాని జిల్లాల్లో కరోనా తీవ్రంగా ఉంటే ఇళ్ల స్థలాలు ఇచ్చేలా ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలివ్వడం ఏంటని చినరాజప్ప ప్రశ్నించారు. ప్రజలు వైరస్​ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Last Updated : Apr 3, 2020, 3:52 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details