విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విజయవాడలో బెజవాడ బార్ అసోసియేషన్ నిరసన దీక్ష చేపట్టింది. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించవద్దంటూ నినాదాలు చేసింది. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా న్యాయవాదులు ఒక్కరోజు నిరహారదీక్ష చేపట్టారు. ఉక్కు కార్మికులకు అండగా ఉంటామన్నారు.
'ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయం అన్యాయం'
కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా బెజవాడ బార్ అసోసియేషన్ నిరసన దీక్ష చేపట్టింది. న్యాయవాదులు విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని నినాదాలు చేశారు. కంపెనీ నష్టాల్లో ఉంటే దాని అభివృద్ధికి కృషి చేయకుండా.. ప్రైవేటీకరణ చేయటం అన్యాయమన్నారు.
బెజవాడ బార్ అసోసియేషన్
వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా దీనిపై ఆధారపడ్డారని అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీపతి పేర్కొన్నారు. కంపెనీ నష్టాల్లో ఉంటే దాని అభివృద్ధికి కృషి చేయకుండా.. ప్రైవేటీకరణ చేయటం అన్యాయమన్నారు. పరిశ్రమ ఏర్పాటుకు ఎంతో మంది త్యాగాలు చేశారని గుర్తుచేశారు. ప్రజా ఉద్యమంలో భాగస్వాములమవుతామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: జగన్ను అవంతి.. చంద్రబాబును గంటా ఒకే వేదికపైకి తీసుకురావాలి: నారాయణ