Mobile Phones Banned Schools In AP: రాష్ట్ర విద్యాశాఖ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి పాఠశాలల్లో మొబైల్ పోన్లను వినియోగించకూడదని నిషేధం విధించింది. దీనిని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది. విద్యాశాఖ అధికారులు ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో అమలయ్యేలా చూడాలని ఆదేశించింది. ఉపాధ్యాయులు పాఠాలను పక్కనపెట్టి ఫోన్లలో గడుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వినియోగంపై పాఠశాల విద్యాశాఖ నిషేధం విధించింది. పాఠశాలలకు విద్యార్థులు మొబైల్ ఫోన్లు తీసుకురావటాన్ని పూర్తిగా నిషేధిస్తూ మెమో జారీ చేసింది. అటు ఉపాధ్యాయులు కూడా తరగతి గదుల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకురాకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉపాధ్యాయులు పాఠశాల ఆవరణలోకి తీసుకువచ్చిన మొబైల్ ఫోన్లను ప్రధానోపాధ్యాయునికి అప్పగించాలని సూచించింది. పాఠశాల సమయం ముగిసిన తర్వాత తీసుకోవాలని సూచించింది. మధాహ్నం భోజన విరామ సమయంలో.. ఇతర విరామ సమయాల్లో మొబైల్ వినియోగించవచ్చని విద్యాశాఖ తెలిపింది.
విధుల నిర్వహణలో సెల్ఫోన్ వినియోగం.. నిషేధం విధించిన అధికారులు
ప్రధానోపాధ్యాయునికి అందించిన తర్వాతే.. ఉపాధ్యాయులు తరగతులకు హాజరుకావాలని విద్యాశాఖ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. విద్యార్థులకు ఎటువంటి ఆటంకం లేని విద్యను అందించేందుకే నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రకటించింది. ఉపాధ్యాయులు బోధించే సమయంలో విద్యార్థులకు ఎలాంటి భంగం కలగకుండా ఉంటుందనే ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపింది.