ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉల్లి దిగుబడి తగ్గింది... ధర పెరిగింది: ప్రద్యుమ్న - ఉల్లి ధరలపై గుంటూరులో మార్కెటింగ్ కమిషన్ సమీక్ష

ఉల్లి, పత్తి కొనుగోళ్లతోపాటు మార్కెటింగ్ శాఖకు వస్తున్న ఆదాయం, ఈనాం విధానం అమలు, తదితర అంశాలపై మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న సమీక్ష నిర్వహించారు. ఉల్లి ధర తగ్గేంతవరకు రాయితీపై అందిస్తామని తెలిపారు.

marketing commissioner conducting a Review meeting for onions at guntur
ఉల్లి ధరల పెరుగుదలపై మార్కెటింగ్ కమిషనర్ ప్రద్యూమ్న అధికారులతో సమీక్ష

By

Published : Dec 3, 2019, 5:52 PM IST

ఉల్లి దిగుబడి తగ్గింది... ధర పెరిగింది: ప్రద్యుమ్న

కమిషనర్ ప్రద్యుమ్న... ఆ శాఖ అధికారులు, మార్కెట్ యార్డుల కార్యదర్శులతో గుంటూరులో సమీక్ష నిర్వహించారు. ఉల్లి ధరలు తగ్గేవరకు రైతుబజార్లలో రాయితీపై ఉల్లి అందిస్తామని చెప్పారు. ఉల్లి, పత్తి కొనుగోళ్లతోపాటు మార్కెటింగ్ శాఖకు వస్తున్న ఆదాయం, ఈనాం విధానం అమలు, తదితర అంశాలపై చర్చించారు.

ఉల్లి ధరలు పెరిగిన తరుణంలో... నవంబర్ 14 నుంచి రైతుబజార్లలో కిలో రూ.25కే పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఈ ఏడాది ఉల్లి దిగుబడులు తగ్గడమే ధరల పెరుగుదలకు కారణమని వివరించారు. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్​లోనూ ఉల్లి పంట ఆశించిన మేర లేదన్నారు. ఈజిప్టు నుంచి 2వేల మెట్రిక్ టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకుంటున్నట్లు వెల్లడించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details