అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రాజకీయ ఐకాస ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 44 రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని సందర్శించిన మాజీ మంత్రులు నక్కా ఆనంద్ బాబు, ప్రత్తిపాటి పుల్లారావు నిరసనకారులకు సంఘీభావం ప్రకటించారు. ఈసందర్భంగా మాట్లాడిన నక్కా ఆనంద్ బాబు...ముఖ్యమంత్రి జగన్ తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రకరకాల సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. కియా లాంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక పరిశ్రమలు రాష్ట్రం వదిలి పోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.పెట్టుబడుదారులు ఏపీ వైపు చూడాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు.
జగన్లో చలనం లేదు