ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 22, 2020, 3:56 PM IST

ETV Bharat / state

'ప్రజలకు మంచి చేద్దామనుకుంటుంటే... ప్రతిపక్షం అడ్డుకుంటోంది'

ప్రజలకు మంచి జరిగే పనులు చేస్తుంటే ప్రతిపక్షం అడ్డుకుంటుందని హోంమంత్రి సుచరిత ఆరోపించారు. గుంటూరు జిల్లా ఏటుకూరు వనమహోత్సవంలో పాల్గొన్న హోంమంత్రి... మెుక్కలు నాటారు.

home minister comments on tdp leaders
హోమంత్రి సుచరిత

గుంటూరు జిల్లా ఏటుకూరు వన మహోత్సవ కార్యక్రమంలో హోం మంత్రి సుచరిత పాల్గొని... జగనన్న కాలనీలో మెుక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు చేస్తున్న మంచి ప్రతి పనికి ప్రతిపక్షం మోకాలొడ్డి, కోర్టుల ద్వారా ఆ పనులకు ఆటంకం కలిగిస్తుందని ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం అమలైతే.. తమ భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందనే ప్రతిపక్ష నేతలు అడ్డుకుంటున్నారని విమర్శించారు. ప్రతి ఒక్కరికిీ సొంత ఇంటి కల ఉంటుందనీ.. దానిని నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి జగన్ అడుగులు వేస్తున్నారని సుచరిత అన్నారు.

ABOUT THE AUTHOR

...view details