ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 25, 2021, 5:08 PM IST

ETV Bharat / state

అనూష హత్య తీవ్రంగా కలిచివేసింది: వాసిరెడ్డి పద్మ

డిగ్రీ విద్యార్థిని అనూష హత్య తీవ్రంగా కలిచివేసిందని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. నరసరావుపేటలో హత్యకు గురైన విద్యార్థిని భౌతికకాయాన్ని సందర్శించి.. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. విద్యార్థిని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

vasireddy padma
అనూష హత్య తీవ్రంగా కలిచివేసింది: వాసిరెడ్డి పద్మ

గుంటూరు జిల్లా నరసరావుపేటలో డిగ్రీ విద్యార్థిని కోట అనూష హత్య అందరినీ తీవ్రంగా కలిచివేసిందని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్​ వాసిరెడ్డి పద్మ అన్నారు. అనూష భౌతికకాయన్ని గురువారం సందర్శించారు. దిశ చట్టం ప్రకారం ప్రభుత్వం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. విద్యార్థిని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విద్యార్థిని కుటుంబానికి సత్వర న్యాయం జరగేలా చూస్తామన్నారు. పాస్ట్ ట్రాక్ కోర్టుల్లో కఠిన శిక్షలుండేలా దిశ చట్టాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details