ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పడవ ప్రమాదంతో.. వరంగల్​లో విషాదఛాయలు - కడిపికొండ

గోదావరి పడవ ప్రమాదం.. తెలంగాణలోని వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండను విషాదంలో ముంచింది. బాధితుల తరఫు కుటుంబీకుల ఆర్తనాదాలతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

పడవ ఘటనతో వరంగల్​ అర్బన్​ కడిపికొండలో విషాదఛాయలు

By

Published : Sep 15, 2019, 6:44 PM IST

పడవ ఘటనతో వరంగల్​ అర్బన్​ కడిపికొండలో విషాదఛాయలు

తూర్పుగోదావరి జిల్లా గోదావరి నదిలో పడవ ప్రమాదం.. తెలంగాణలోనూ విషాదం నింపింది. బాధితుల్లో తెలంగాణవాసులూ ఉన్న కారణంగా.. వారి బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ వారు క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని కాజీపేట మండలం కడిపికొండ ప్రాంతానికి చెందిన గొర్రె ప్రభాకర్ సహా 9 మంది బోటులో ఉన్నట్లు తెలిసింది. వీరిలో వరంగల్​ వాసులు గొర్రె ప్రభాకర్​, కొమ్మల రవి, సిద్ది వెంకట స్వామి, బాస్కె దశరథం సురక్షితంగా ఒడ్డుకు చేరారు. మిగిలిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details