ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 11, 2021, 7:22 PM IST

ETV Bharat / state

రూ. 5 వేలు లంచం తీసుకుంటు.. అనిశాకు చిక్కిన వీఆర్వో

ములగపూడి వీఆర్వో... అనిశా అధికారులకు చిక్కారు. రైతు నుంచి 5 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు వలపన్ని ఆమెను పట్టుకున్నారు.

acb officers catched vro
ఏసీబీకి చిక్కిన వీఆర్వో

తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలం ములగపూడి వీఆర్వో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ఓ రైతు నుంచి 5 వేల రూపాయలు తీసుకుంటుండగా అనిశా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అన్నవరం గ్రామానికి చెందిన వీర నాగ బాబు అనే రైతు 7 ఎకరాల భూమిని ఆన్​లైన్ చేసేందుకుగాను... వీఆర్వో దేవత లంచం డిమాండ్ చేశారు.

బాధితుడు విషయాన్ని అనిశా అధికారులకు తెలియజేశారు. రాజమహేంద్రవరం అనిశఆ సిబ్బంది.. రెడ్ హ్యాండెడ్ గా ఆమెను పట్టుకున్నారు. నిందితురాలిని రాజమహేంద్రవరం ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పరిచారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details