ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంబులెన్స్ సిబ్బంది అమానుషం... ఇంటి ముందే కరోనా రోగి మృతదేహం - అనంతపురం కొవిడ్ వార్తలు

కరోనాతో ఓ వృద్ధుడు మృతి చెందటంతో..ఆ మృతదేహాన్ని ఎవరికీ చెప్పకుండా ఆ వ్యక్తి ఇంటి ముందు వదిలేసి వెళ్లిపోయారు ప్రైవేటు అంబులెన్స్ సిబ్బంది. ఈ ఘటన అనంతపురం జిల్లా లేపాక్షిలో చోటుచేసుకుంది.

The corpse of a man with a corona in a miserable condition
లేపాక్షిలో దారుణం

By

Published : Sep 4, 2020, 1:06 PM IST

అనంతపురం జిల్లా లేపాక్షిలో కరోనా లక్షణాలతో దయనీయ స్థితిలో 74 సంవత్సరాల వయసు గల అనంతరావు అనే వృద్ధుడు అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అయితే ప్రైవేటు అంబులెన్స్ సిబ్బంది మృతదేహాన్ని ఆ వ్యక్తి ఇంటి ముందు వదిలేసి బంధువులకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు. కుటుంబసభ్యులు పట్టించుకోకపోవటంతో.... చాలా సేపటి వరకు మృతదేహం ఇంటి ముందే ఉంది. దీంతో స్థానికులు ఆందోళన చెందారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ బలరాం అక్కడికి చేరుకుని మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details