ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మున్సిపల్ ఎన్నికల్లో తెదేపా విస్తృత ప్రచారం - అనంతపురం జిల్లా తాజా వార్తలు

అనంతపురం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెదేపా నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెేళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Tedepa campaigns extensively in municipal elections in Rayadurg
మున్సిపల్ ఎన్నికల్లో తెదేపా విస్తృత ప్రచారం

By

Published : Feb 23, 2021, 9:20 AM IST

అనంతపురం జిల్లా రాయదుర్గంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తెదేపా నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. తెదేపా పోలిట్​ బ్యూరో సభ్యులు , మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పూల నాగరాజు, తెదేపా నాయకులతో కలిసి 30వ వార్డులో మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పట్టణ ప్రజలకు తాగునీరు , విద్యుత్ దీపాలు వంటి మౌలిక వసతులు కల్పించడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వారు విమర్శించారు.

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా విశాఖ జిల్లా నర్సీపట్నం పురపాలక పరిధిలో తెదేపా ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఛైర్మన్ పదవితో పాటు 28 వార్డులకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నర్సీపట్నం సీనియర్ నాయకులు తెదేపా పొలిట్​బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి ఆయన కుమారుడు రాజేష్ పోటీలో పట్టణంలోని పలు వ్యాపార సంస్థలను కూరగాయల దుకాణం దారుల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తూ తెలుగుదేశం పార్టీ విజయానికి సహకరించాలని కోరుతున్నారు.

నగరాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమవుతుందని విజయనగరం తెదేపా ఇన్​చార్జ్ అదితి గజపతిరాజు అన్నారు. విజయనగరం నగరపాలక సంస్థలో వార్డులకు పోటీ చేస్తున్న కార్పొరేటర్ అభ్యర్థుల తరపున తెదేపా ప్రచారం ప్రారంభించింది. తెదేపా జిల్లా కార్యదర్శి, ఐవీపీ రాజు, విజయనగరం నియోజకవర్గ బాధ్యురాలు అదితి గజపతిరాజు పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. నగరంలోని 1వ డివిజన్లో మొదటి రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఇదీ చదవండి:నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అనుక్షణం ఉత్కంఠ

ABOUT THE AUTHOR

...view details