ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 20, 2020, 7:15 AM IST

ETV Bharat / state

నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు... ఏడుమంది అరెస్టు

పెద్ద ఎత్తున నాటు సారా తయారు చేస్తున్న 7 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో జరిగింది. నిందితుల నుంచి నాటుసారా,4 మోటారు సైకిళ్లను, ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు
నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు

అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో ఎక్సైజ్​ పోలీసులు దాడులు చేశారు. రేపల్లే పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నాటుసారా తయారు చేస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న కంబదూరు ఎక్సైజ్ సీఐ రవి, కళ్యాణ దుర్గం సీఐ హరికృష్ణ తమ సిబ్బందితో దాడులు నిర్వహించి... ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. 55 లీటర్ల సారాను, 4 మోటారు సైకిళ్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details