ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 30, 2020, 6:23 PM IST

ETV Bharat / state

ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను రైతులు అందరు సద్వినియోగం చేసుకోవాలని పెనుగొండ సబ్ కలెక్టర్ నిశాంతి అన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండలో శనివారం రైతు భరోసా కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు.

farmers should utilize government schemes
ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను రైతులు అందరు సద్వినియోగం చేసుకోవాలని పెనుగొండ సబ్ కలెక్టర్ నిశాంతి అన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండలో శనివారం రైతు భరోసా కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు.

రైతు భరోసా కేంద్రం ద్వారా అందిస్తున్న సేవల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన ఎరువులు, పురుగు మందులు నమోదు చేసుకుని ఆన్లైన్లో తెప్పించుకునే సదుపాయం కల్పించారు. రైతుల అనుమానాలను టీవీ ద్వారా నివృత్తి చేసుకోవచ్చని వివరించారు.

ఈ కార్యక్రమంలో పెనుగొండ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు స్వయంప్రభ, మండల వ్యవసాయ అధికారి రాకేష్ నాయక్, పలువురు వైకాపా నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: లారీని ఢీకొట్టిన టిప్పర్​.. డ్రైవర్​కు తీవ్ర గాయాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details