రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను రైతులు అందరు సద్వినియోగం చేసుకోవాలని పెనుగొండ సబ్ కలెక్టర్ నిశాంతి అన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండలో శనివారం రైతు భరోసా కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు.
రైతు భరోసా కేంద్రం ద్వారా అందిస్తున్న సేవల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన ఎరువులు, పురుగు మందులు నమోదు చేసుకుని ఆన్లైన్లో తెప్పించుకునే సదుపాయం కల్పించారు. రైతుల అనుమానాలను టీవీ ద్వారా నివృత్తి చేసుకోవచ్చని వివరించారు.