ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 9, 2020, 7:37 PM IST

ETV Bharat / state

యువకుడి వినూత్న నిరసన..ఏం చేశాడంటే...!

గ్రామంలో పేరుకుపోయిన చెత్తను ఓ యువకుడు సచివాలయం ముందు వేసి నిరసన తెలిపిన ఘటన అనంతపురం జిల్లా పరిగి మండలం ఊటుకూరులో జరిగింది.

సచివాలయం ముందు చెత్త వేసి నిరసన తెలిపిన యువకుడు
సచివాలయం ముందు చెత్త వేసి నిరసన తెలిపిన యువకుడు

అనంతపురం జిల్లా పరిగి మండలం ఊటుకూరు గ్రామంలో కొన్ని నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించారు. దీంతో గ్రామంలో చెత్తచెదారం పెరిగిపోయింది. సహనాన్ని కోల్పోయిన నాగరాజు అనే యువకుడు చెత్తచెదారం తీసుకుని సచివాలయం ముందు వేసి నిరసన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా అధికారులు గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టి గ్రామాన్ని శుభ్రంగా ఉంచాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details