Accidents in Andhra Pradesh:ఎన్టీఆర్ జిల్లాలో ఓ టిప్పర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కొండూరు మండలం రామచంద్రాపురం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు వివరాలు తెలియాల్సి ఉందిఅన్నమయ్య జిల్లా రాజంపేటలో ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తి బస్సు కింద పడి చనిపోయాడు. రాత్రి సమయంలో ఈ సంఘటన జరగడంతో ఆర్టీసీ అధికారులకు, పోలీసులకు తెలియలేదు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ మద్దయ్య ఆచారి, ఎస్సై లక్ష్మీప్రసాద్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని మృతికి గల కారణాలు తెలుసుకోవడం కోసం దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో చెలరేగిన మంటలు- పూర్తిగా దగ్ధమైన వాహనం
Road accident in Alluri District: అల్లూరి సీతారామరాజు జిల్లా సమీపంలోని కురిడి వద్ద ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరు పర్యాటకులు ప్రమాదానికి గురై మృతి చెందారు. విజయనగరం జిల్లా సాలూరు మండలం సామంత వలస గ్రామానికి చెందిన ఆరుగురు మిత్రులు అరకు అందాలను తిలకించేందుకు ద్విచక్ర వాహనాలపై వచ్చారు. అరకు నుంచి వంజంగి కొండలను చూసేందుకు వెళుతుండగా ద్విచక్ర వాహనం భారీ వాహనాన్ని ఢీకొనింది. ఈ ప్రమాదంలో వాసు, రవితేజ అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. విహారానికి వచ్చి ఆనందంగా గడుపుదాం అన్న తరుణంలో ప్రమాదానికి గురై ఇద్దరు మృతి చెందడంతో మిత్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు
ప్రైవేటు బస్సు ట్రాక్టర్ ఢీకొని నలుగురు మృతి - పరిహారం చెల్లించాలని జాతీయ రహదారిపై ఆందోళన