ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

దైవ దర్శనానికి వెళ్తే... దొంగలు దోచుకెళ్లారు..! - crime

హైదరాబాద్​లోని ఓ స్థిరాస్తి వ్యాపారి ఇంట్లో భారీ చోరి జరిగింది. 50 తులాల బంగారు నగలు, 5 కిలోల వెండి, నగదును దొంగలు దోచుకెళ్లారు.

theft-in-real-estate-business-men-house-in-hyderabad
దైవ దర్శనానికి వెళ్తే... దొంగలు దోచుకెళ్లారు!

By

Published : Dec 31, 2019, 5:35 PM IST

దైవ దర్శనానికి వెళ్తే... దొంగలు దోచుకెళ్లారు!

హైదరాబాద్‌ జవహర్‌నగర్​లోని మైత్రీ ఎన్‌క్లేవ్‌లో స్థిరాస్తి వ్యాపారి నర్సింగరావు ఇంట్లో భారీ చోరీ జరిగింది. సోమవారం కుటుంబ సమేతంగా నర్సింగరావు యాదాద్రి దర్శనానికి వెళ్లగా... దుండగులు ఇంట్లో చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. 50 తులాల బంగారు నగలు, 5 కిలోల వెండి, నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జవహర్​నగర్​ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details