తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరి అదృశ్యమైన ఓ రోగి.. మృతి చెందాడు. అంబాజీపేట మండలం వ్యాఘ్రేశ్వరానికి చెందిన శ్రీనివాస్.. కామెర్ల వ్యాధి చికిత్స కోసం అమలాపురం ఆస్పత్రిలో చేరాడు. అనంతరం శ్రీనివాస్ కనిపించట్లేదని.. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే గురువారం అమలాపురం నల్ల వంతెన సమీపంలో శ్రీనివాస్ మృతదేహం కనిపించింది. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: