ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 17, 2021, 8:42 PM IST

ETV Bharat / crime

ఆస్పత్రిలో అదృశం.. వంతెన దగ్గర మృతదేహం..

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స కోసం చేరిన శ్రీనివాస్ అనే వ్యక్తి.. పట్టణంలోని నల్ల వంతెన వద్ద శవమై తేలాడు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

missing person found dead
ఆస్పత్రిలో అదృశం.. శవమై తేలి

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరి అదృశ్యమైన ఓ రోగి.. మృతి చెందాడు. అంబాజీపేట మండలం వ్యాఘ్రేశ్వరానికి చెందిన శ్రీనివాస్.. కామెర్ల వ్యాధి చికిత్స కోసం అమలాపురం ఆస్పత్రిలో చేరాడు. అనంతరం శ్రీనివాస్​ కనిపించట్లేదని.. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే గురువారం అమలాపురం నల్ల వంతెన సమీపంలో శ్రీనివాస్ మృతదేహం కనిపించింది. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details