ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 12, 2020, 12:37 AM IST

ETV Bharat / city

విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా బదిలీ

విశాఖపట్నానికి నూతన పోలీస్ కమిషనర్​ను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న ఆర్​కే మీనాను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది.

vishaka police commissioner rk meena transferred
vishaka police commissioner rk meena transferred

ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం సీపీ ఆర్‌కే మీనాను బదిలీ చేసింది. ఆయన స్థానంలో మనీష్‌కుమార్‌ సిన్హాను నియమించింది. ఆర్‌.కె.మీనాను డీజీపీ కార్యాలయంలో‌ రిపోర్టు చేయాలని ఆదేశించింది.

మరోవైపు విజిలెన్స్ డీజీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డిని ఇంటెలిజెన్స్ డీజీగా బదిలీ చేసింది. ఆయనకే విజిలెన్స్ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.

ABOUT THE AUTHOR

...view details