విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన
విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఏపీ పవర్ ఎంప్లాయిస్ జాక్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో నిరసన చేపట్టారు. తక్షణమే బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన
కేంద్ర ఇంధన శాఖ ప్రవేశపెట్టనున్న విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ బిల్లును ఏపీ పవర్ ఎంప్లాయిస్ వ్యతిరేకిస్తున్నారు. కేంద్రం నిర్ణయానికి నిరసనగా జాక్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నార్ల తాతారావు విద్యుత్ కేంద్రం (ఎన్టీటీపీఎస్) గేటు వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.