ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 29, 2021, 3:02 PM IST

ETV Bharat / city

ఈఎస్‌ఐ ఆసుపత్రుల ఆధునీకరణకు చర్యలు: మంత్రి జయరాం

రాష్ట్రంలో ఆన్​లైన్ ద్వారా ప్రతి కార్మికుడికి ప్రభుత్వ సేవలు అందిస్తున్నామని మంత్రి జయరాం అన్నారు. తమ ప్రభుత్వం ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు.

ఈఎస్‌ఐ ఆసుపత్రుల ఆధునీకరణకు చర్యలు: మంత్రి జయరాం
ఈఎస్‌ఐ ఆసుపత్రుల ఆధునీకరణకు చర్యలు: మంత్రి జయరాం

విజయవాడ గుణదలలో ఆధునికీకరించిన ఈఎస్‌ఐ డిస్పెన్సరీని మంత్రి జయరాం ప్రారంభించారు. ఆన్‌లైన్‌ ద్వారా ప్రతి కార్మికుడికి సేవలు అందిస్తున్నామని చెప్పారు. మెరుగైన వైద్యం అందించడానికి నాడు నేడు కింద ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

చాలా డిస్పెన్సరీలకు సొంత స్థలాలు లేవని పేర్కొన్నారు. అవినీతికి తావు లేకుండా ఉండాలనే ఆన్‌లైన్‌ డిస్పెన్సరీని ఏర్పాటు చేశామని చెప్పారు. తమ ప్రభుత్వం ప్రజల ఆరోగ్య భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని.. ఈఎస్‌ఐ ఆసుపత్రుల ఆధునీకరణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details