విజయవాడ నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లాక్డౌన్ అమలులో ఉన్నా...యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్న వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అనుమతించిన సమయంలో కాకుండా మిగతా సమయాల్లో రోడ్లపైకి వచ్చే వారిపై కొరడా ఝులిపిస్తున్నారు. ఎన్టీఆర్ సర్కిల్ ప్రాంతాల్లో ఉదయం 9 తర్వాత రోడ్లపైకి వచ్చిన వాహనదారులపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. 9 గంటల తర్వాత అత్యవసర సేవలందిస్తున్న వారికి మాత్రమే అనుమతి ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. వారు కూడా కచ్ఛితంగా గుర్తింపుకార్డులు చూపిస్తేనే అనుమతిస్తామన్నారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
లాక్డౌన్ అతిక్రమణ...వాహనదారులపై కేసులు - విజయవాడలో లాక్డౌన్ అతిక్రమణ
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చే వాననాలపై విజయవాడ పోలీసులు కేసులు నమోదు చేసి జరిమానాలు వసూలు చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

లాక్డౌన్ అతిక్రమణ