ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 20, 2021, 7:28 PM IST

ETV Bharat / city

మహానంది ఆలయ దర్శన వేళల్లో మార్పులు

కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం మహానంది ఆలయ దర్శన వేళల్లో అధికారులు మార్పులు చేశారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు భక్తులకు దర్శించుకునే అవకాశాన్ని కల్పించారు.

karnulu Mahanadi Temple visit timings changed
karnulu Mahanadi Temple visit timings changed

కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం మహానంది ఆలయ దర్శన వేళల్లో అధికారులు మార్పులు చేశారు. లాక్​డౌన్ సడలింపు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులకు మహానందీశ్వర స్వామి వారిని దర్శించుకునే వెసులుబాటు కల్పించారు. జూన్ 21 వతేదీ సోమవారం నుంచి ఈ దర్శన వేళలు అమల్లోకి వస్తాయి. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఆన్ లైన్ లింకు సాయంతో పరోక్ష సేవ ద్వార భక్తులు ప్రత్యేక పూజలు చేసుకొనే వెసులుబాటు ఉందని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:Srisailam: మల్లన్న ఆలయ దర్శన వేళల్లో మార్పులు: ఈవో

ABOUT THE AUTHOR

...view details