ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మద్యం విక్రయిస్తే చర్యలే..: ఎక్సైజ్​శాఖ - కడపజిల్లా

కడప జిల్లావ్యాప్తంగా పోలింగ్ ముగిసే వరకూ మద్యం విక్రయించకుండా చర్యలు చేపట్టాం. ఎవరైన రూల్స్​ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. పక్క రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చే అక్రమ మద్యం రవాణాపై దృష్టి సారించాం. - శ్రీనివాసరావు, కడప జిల్లా ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్​మెంట్ అసిస్టెంట్ కమిషనర్

కడప జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ముగిసే వరకూ మద్యం విక్రయించకుండా చర్యలు.

By

Published : Apr 9, 2019, 8:41 PM IST

కడప జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ముగిసే వరకూ మద్యం విక్రయించకుండా చర్యలు.

పోలింగ్ కు 48 గంటల ముందు కడప జిల్లాలో ఎక్కడా మద్యం విక్రయించకుండా పటిష్టమైన చర్యలు చేపట్టామని కడప జిల్లా ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్​మెంటు అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే అక్రమ మద్యం విక్రయిస్తున్న పది దుకాణాలను సీజ్ చేసి.. వారి లైసెన్సులు కూడా రద్దు చేశామని తెలిపారు. మరో 30 దుకాణాలపై కేసులు నమోదు చేశామన్నారు. గత ఏడాది మార్చి-ఏప్రిల్ నెలలో ఎంత మోతాదులో మద్యం సరఫరా చేశామో... ఇపుడూ అంతే సరఫరా చేస్తున్నామన్నారు. కర్నాటక నుంచి వచ్చే అక్రమ మద్యంపై నిఘా పెట్టామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details