ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 3, 2021, 3:36 PM IST

ETV Bharat / city

ముత్యాలమ్మ గుడిలో చోరీ.. ఇదిగో వీడియో..

ఓ దొంగ ఏకంగా ఆలయంలోనే చోరీ చేశాడు. అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో గుడి తలుపులు పగులగొట్టి... హుండీలోని నగదును, విలువైన సామగ్రిని దోచుకెళ్లాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదు అయ్యాయి.

robbery in temple
ముత్యాలమ్మ గుడిలో చోరీ

ముత్యాలమ్మ గుడిలో చోరీ సీసీ కెమెరా ఫుటేజ్

సికింద్రాబాద్‌ మోండా మార్కెట్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయంలో దొంగతనం జరిగింది. హుండీలో ఉన్న నగదును దొంగలు దోచుకెళ్లారు. అర్ధరాత్రి సమయంలో చోరీకి పాల్పడ్డారు. దేవాలయ తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం హుండీని పగులగొట్టి.. అందులో ఉన్న విలువైన వస్తువులను, నగదును అపహరించారు.

ఉదయాన్నే స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి పోలీసులు చేరుకున్నారు. చోరీ జరిగిన తీరును పరిశీలించారు. దొంగతనం చేసే దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చోరీకి పాల్పడింది స్థానికులేనా.. లేక బయట వ్యక్తుల అనే కోణంలో విచారణ ప్రారంభించారు.

ఇదీ చదవండి:రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల దాడులు.. భారీగా అక్రమ మద్యం, నాటుసారా పట్టివేత

ABOUT THE AUTHOR

...view details