ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 1, 2020, 7:19 PM IST

ETV Bharat / city

ముఖ్యమంత్రి జగన్​ది అసమర్థ పాలన: నక్కా ఆనందబాబు

మందడంలో దీక్ష చేస్తున్న రైతులకు తెదేపా నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు సంఘీభావం తెలిపారు. ఒక్క అవకాశం పేరుతో జగన్​.. అందళమెక్కి అసమర్థ పాలన చేస్తున్నారని విమర్శించారు.

nakka-anandababu-comments-on-cm-jagan
nakka-anandababu-comments-on-cm-jagan

మాజీ మంత్రి నక్కా ఆనందబాబు

ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అల్లకల్లోలం సృష్టిస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. మందడంలో 46వ రోజు దీక్ష చేస్తున్న రైతులు, రైతు కూలీలు, మహిళలకు ఆయన సంఘీభావం తెలిపారు. రైతులతో కలిసి దీక్షలో కూర్చున్న ఆయన....ఒక్క అవకాశం పేరుతో జగన్ మోహన్ రెడ్డి అందళమెక్కి అసమర్థ పాలన అందిస్తున్నారన్నారు. రైతులు, మహిళలను రోడ్డున పడేసి చోద్యం చూస్తున్నారన్నారు. ఇన్ని రోజులుగా రాజధాని గ్రామాల్లో ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేస్తున్నా ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్లుగా కూడా లేదని ఆక్షేపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details