ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'చర్చలు జరుగుతున్నాయి త్వరలోనే పోలవరం బకాయిలు విడుదల' - పోలవరం ప్రాజెక్టుపై రాజ్యసభలో విజయసాయిరెడ్డి ప్రశ్న

రాజ్యసభ జీరో అవర్‌లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బకాయిల అంశాన్నిఎంపీ విజయసాయిరెడ్డి లేవనెత్తారు. ప్రాజెక్టు బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఎంపీ ప్రశ్నకు స్పందించిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్... త్వరలోనే ప్రక్రియను పూర్తి చేస్తామని బదులిచ్చారు.

mp vijay sai reddy
mp vijay sai reddy

By

Published : Sep 15, 2020, 2:03 PM IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వరప్రదాయిని అయినటువంటి పోలవరం ప్రాజెక్టును 2021 డిసెంబర్‌ కల్లా పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించిందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో అన్నారు. జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టు కావడంతో ప్రాజెక్టుకు అయ్యే మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆయన తెలిపారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిధుల కోసం వేచి చూడకుండా ఇప్పటికే ప్రాజెక్టుపై 3వేల805 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందన్నారు.

పోలవరంపై ఎంపీ విజయసాయి ప్రశ్న... స్పందించిన కేంద్రమంత్రి

ప్రక్రియను పూర్తి చేస్తాం: నిర్మలా సీతారామన్‌, కేంద్ర ఆర్థికమంత్రి

కాగ్‌ ఇచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బకాయిల విడుదలకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక మంత్రి, కేంద్ర జల శక్తి మంత్రితో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. త్వరలోనే ఈ మొత్తం బకాయిల చెల్లింపు ప్రక్రియను పూర్తి చేస్తామని బదులిచ్చారు.

ఇదీ చదవండి
అమరావతి భూములపై విచారణ... 12 మందిపై ఏసీబీ కేసు

ABOUT THE AUTHOR

...view details