ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే అనంతపురంలో నలుగురు వైద్య సిబ్బందికి కరోనా సోకిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. నలుగురు వైద్య సిబ్బంది చికిత్స చేసిన 64ఏళ్ల వృద్ధుడు కరోనా వల్ల చనిపోయాడని ట్వీట్ చేశారు. ఆస్పత్రుల్లో సేవలు అందించే వైద్య సిబ్బందిని ఎలాగైనా రక్షించుకోవాలన్నారు. వైద్య సిబ్బందికి అవసరమైన అన్ని రక్షణ పరికరాలు తక్షణమే అందించేలా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రాణాలు పణంగా పెట్టి సేవలందిస్తున్నవారికి ఇది సర్కారు చేసే చిన్న సాయం మాత్రమేనని ట్విట్టర్లో పేర్కొన్నారు.
'ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే వైద్య సిబ్బందికి కరోనా'
అనంతపురంలో నలుగురు వైద్య సిబ్బంది కరోనా బారిన పడటానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వైద్యులకు కరోనా సోకిందన్నారు. క్షేత్రస్థాయిలో సేవలు అందించే సిబ్బందికి రక్షణ పరికరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
babu
TAGGED:
చంద్రబాబు ట్వీట్స్ న్యూస్