వైఎస్ఆర్ జలకళ పథకానికి సవరణలు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చింది. పని చేయని బోర్లు ఉన్న రైతులకూ కూడా జలకళ వర్తింపజేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సర్వీసులో ఉన్న, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఈ పథకాని అనర్హులుగా ప్రకటించారు. రెండున్నర ఎకరాలు ఉన్న రైతు గ్రూపులకూ జలకళ పథకం వర్తింపజేశారు.
రైతు కుటుంబంలో ఒకరికే వైఎస్ఆర్ జలకళ వర్తింపజేయాలని స్పష్టం చేశారు. పొలంలో తొలిబోరు విఫలమైతే హైడ్రో, జియో ఫిజికల్ సర్వే చేయాలని పేర్కొంది. నీటి లభ్యత నిర్ధరణ అయ్యాకే పొలంలో రెండో బోరు వేసేలా నిబంధనలు సవరించారు. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జి.కె.ద్వివేది ఆదేశాలు జారీ చేశారు.