రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ను కేంద్ర ప్రభుత్వం ప్రభావితం చేసింది. పశ్చిమబంగాలో 40 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ దేశ ప్రధాని మాట్లాడ్డం విడ్డూరంగా ఉంది. కేంద్రం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. 75 రోజుల ఎన్నికల ప్రక్రియ చీకట్లో పెట్టడం ఏంటి? ప్రజలు ఓట్లేసినందుకు బాధపడలా..! భాజాపా సిగ్గుపడాల్సిన విషయమిది. పరిపాలన స్తంభించేలా కేంద్రం ప్రవర్తించడం సరికాదు.'
--- కళా వెంకట్రావు, తెదేపా రాష్ట్ర అధ్యక్షులు
ప్రధాని వ్యాఖ్యలు విడ్డూరం: కళా వెంకట్రావు - ap news
పశ్చిమ బంగాలో ప్రధాని చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు విమర్శించారు. ఎన్నికల సమయంలో 40 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ మోదీ మాట్లడ్డామేంటని... శ్రీకాకుళం జిల్లా రాజాంలో ప్రశ్నించారు.

కళా వెంకట్రావు
ప్రధాని వ్యాఖ్యలపై స్పందించిన కళా
ఇవీ చదవండి...మోదీ, రాహుల్ వ్యాఖ్యలపై నేడు ఈసీ నిర్ణయం