national

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

ETV Bharat / snippets

భిక్షాటన చేస్తూ పర్సులు దొంగిలిస్తున్న మహిళలు - సీసీటీవీ ఆధారంగా పట్టుకున్న స్థానికులు

TWO WOMEN BEGGAR ROBBERY
women Beggars Robbery in Bhadrachalam (ETV Bharat)

women Beggars Robbery in Bhadrachalam : ఇద్దరు మహిళలు చంటి పిల్లాడితో భిక్షాటన చేస్తున్నట్లు నటించి, ఓ మహిళ పర్సును దొంగలించారు. ఈ ఘటన భద్రాచలంలో జరిగింది. గురువారం భిక్షాటన చేస్తూ ఓ దుకాణానికి​ వెళ్లిన మహిళలు, అక్కడే ఉన్న మరో మహిళ పర్సును దొంగిలించారు. పర్సులో ఉన్న రూ.5 వేలు తీసుకుని మిగతా ఫ్రూఫ్​ కార్డులు దారిలో వదిలేసి వెళ్లారు.

ఓ యువకుడి సహాయంతో సీసీటీవీ పరిశీలించగా భిక్షాటన చేస్తున్న ఇద్దరు మహిళా దొంగలను పట్టుకున్నారు. దీంతో అక్కడున్న వారంతా ఆ మహిళలను తిట్టి దొంగలించిన సొమ్ము తీసుకుని బాధిత మహిళకు అందించారు. పట్టణంలో చాలా మంది ఇలాంటి మహిళలు భిక్షాటన చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details