By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 24, 2024, 10:14 PM IST
బైక్పై కోటి రూపాయల బంగారు బిస్కెట్లు తరలింపు - వాహన తనిఖీల్లో స్వాధీనం
Police Seized Gold Biscuits in Kadapa : కడప వన్ టౌన్ వద్ద పోలీసుల తనిఖీలో అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయలు విలువ చేసే బంగారం పట్టుబడింది. ఎలాంటి బిల్లులు లేకుండా తరలిస్తున్న బంగారు బిస్కెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు కడప వన్ టౌన్ సమీపంలోని గాంధీ బొమ్మ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. దేశముఖ్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంలో బ్యాగులో బంగారం తీసుకుని వెళ్తుండగా పోలీసులు తనిఖీలు చేశారు. ప్రభుత్వానికి బిల్లులు చెల్లించకుండా అక్రమ మార్గంలో బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్రమ బంగారం స్వాధీనం చేసుకుని తిరుపతి ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చారు.